నవతెలంగాణ-గోవిందరావుపేట: గులాబీ పార్టీలో చేరికల పర్వం ప్రతిరోజు కొనసాగుతోంది. సోమవారం మండలంలోని మోట్లగూడెం టపా మంచా గ్రామాల నుండి యువకులు పెద్ద స్థాయిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురపునేని సాయికుమార్ ఎం.పీ.పీ. సూడి శ్రీనివాస్ రెడ్డి సమీక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు “సూరపనేని సాయికుమార్” మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి చేస్తున్న తీరు ప్రతి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరిక ఇలా అన్ని రంగాల ప్రజలను ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు.ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిగా భావించి, భవిష్యత్తులో సముచిత స్థానం గౌరవం ఇస్తానని తెలిపారు. మొట్ల గూడెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చెయ్యాలని సూచించారు, రానున్న 20 రోజుల్లో పార్టీ కోసం కష్టపడండి వొచ్చే 5 సంవత్సరాలు పార్టీ మీకోసం కష్టపడుతుందని తెలిపారు.కొత్త బిచ్చగాడు పొద్దురేగడనట్టు కొత్త కొత్త నాయకులు మీ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మొసపోదని గుర్తు చేసారు, ఈ 9 ఏండ్లలో ములుగు జిల్లా ఎంత అభివృద్ధి జరిగిందని ఆత్మపరిసలన చేసుకోవాలని అన్నారు, కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో బడే నాగజ్యోతి గారిని గెలిపించాలని,సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి గా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,మండల సమన్యాయ సమితి సభ్యుడు బుర్ర సురేందర్ గౌడ్, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి,గోవిందరావుపేట తొలి మలిదశ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు అజ్మీర సురేష్ గారు, పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్, సీనియర్ నాయకులు నామాల మురళి, వి లక్ష్మణ్, పి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.