నవతెలంగాణ హైదరాబాద్: ఛత్తీస్ గాఢ్( Chhattisgarh)లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు దశల్లో పోలింగ్ జరగనున్న ఛత్తీస్ గాఢ్(Chhattisgarh)లో ప్రధాన పోరు కాంగ్రెస్(Congress), బీజేపీ(Bjp)మధ్యే జరగనుంది. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. సీఎం భూపేష్ బఫేల్ నాయకత్వం పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ప్రధాని మోడీ(modi) కరిష్మాతోనే గెలవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మరోవైపు అవినీతి రహితపాలనే ధ్యేయమంటూ ఆమ్ ఆద్మీ(AAP) సైతం అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గడ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.