నవతెలంగాణ – కెనాడా: కార్చిచ్చు దీని దెబ్బకు ఓ నగరమే ఖాళీ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు కార్చిచ్చు దూసుకొస్తోంది. వెంటనే ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది. ఆ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ‘మీరు ఇక్కడే ఉండాలనుకుంటే.. మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే’ అంటూ అప్రమత్తం చేసింది. ల్లోనైఫ్ నగరంలో 20 వేల మంది నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రజలను తరలించేందుకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఆ నగర మేయర్ తెలిపారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామన్నారు. ‘ఇది ప్రతిఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయం. వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోండి.