నవతెలంగాణ:రెంజల్ : రెంజల్ మండలంలో ఆదివారం మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన లభించింది. రెంజల్ మండలంలోని సాటాపూర్, కందకుర్తి, పేపర్ మిల్, నీల గ్రామాలలో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలను ప్రజలందరికీ వర్తించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ముఖ్యంగా యువత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నారని మాజీ మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒంటరి మహిళలకు 2500, రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకు సిలిండర్, నిరుద్యోగులకు జీవనభృతి తదితర పథకాలను ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు. ఆయన వెంట అంతిరెడ్డి రాజిరెడ్డి, తాహెర్బిన్ అందన్, గడుగు గంగాధర్, రెంజల్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, స్థానిక నాయకులు జావిద్ ఉద్దీన్, జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, గంగా కృష్ణ, గ యా సోదిన్, నితిన్, ఎమ్మెల్ రాజు, సల్మాన్ ఖాన్, రవి, సిద్ధ సాయిలు, సద్దాం, గోసుల గంగా కిషన్, రాకేష్, సోక్కుల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.