నవతెలంగాణ- హైదరాబాద్: కోళ్ల ఫారాలు లాగానే తేళ్ల ఫారాలు కూడా ఉంటాయని, వాటిల్లో వేల సంఖ్యలో విషపూరిత తేళ్లను పెంచుతారని తెలుసా? తేలు పేరు చెబితేనే మనం భయపడిపోతాం కానీ తేలు విషానికి మార్కెట్లో బోలెడంత డిమాండ్ ఉంది. లీటర్ విషం ధర రూ.82 కోట్ల వరకూ ఉంటుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు. తేలు విషాన్ని సౌందర్య ఉత్పత్తులు, ఇతర ఔషధాల్లో విరివిగా వాడతారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయిక వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యం ఉంది. దీంతో, అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. క్యాన్సర్ మందుల తయారీలోనూ తేలు విషం వాడతారట. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషం వస్తుంది. తేలు కొండెను ట్వీజర్స్తో పిండి విషాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి హానీ జరగదు. నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న తేళ్ల ఫారం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!