నవతెలంగాణ – రాజస్థాన్
రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల్లో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు బాలుడు. ఓ స్టీల్ డమ్ములో పిల్లల్ని దించి తాళం వేయడంతో వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 27 ఏళ్ల నిందితురాలి భర్త మైనింగ్ భర్త కార్మికుడని, అతడు విధులకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, పిల్లలను ఆమె చంపేందుకు ఇదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.