నవతెలంగాణ – నాగ్పుర్: విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. వెంటనే ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ముంబయి నుంచి రాంచీ బయలుదేరిన ఇండిగో విమానంలో సోమవారం చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం. 62 ఏళ్ల ఓ ప్రయాణికుడు కొంతకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇండిగో విమానంలో రాంచీకి బయలుదేరిన అతడు.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి రక్తపు వాంతులు చేసుకున్నాడు. సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం అందించి.. విమానాన్ని అత్యవసరంగా నాగ్పుర్లో ల్యాండ్ చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.