నవతెలంగాణ -నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నేపల్లి గ్రామంలో మోటార్ బైక్ పై వెళ్తున్న కొండ సాయి వంశీ(21) లారీ కిందపడి గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జన్నేపల్లి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ధాన్యం లారీ జన్నేపల్లిలోని ఎస్ ఎస్ ఆర్ పాఠశాల ముందు నుండి వెళ్తుండగా మోటార్ బైక్ పై వెళ్తున్న పొతంగల్ గ్రామానికి చెందిన కొండ సాయి వంశీకీ ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు ఎస్సై రాజారెడ్డి సంఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.