నవతెలంగాణ – ఖమ్మం
ఖమ్మంలో శ్రీశ్రీ సర్కిల్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. వైరాలో హెచ్.పి గ్యాస్ లో పనిచేస్తున్న శ్రీకన్య(30), నునావత్ రాణి(28) ఇద్దరు ఆఫీస్ కి తమ స్కూటీ మీద వెళుతుండగా శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో శ్రీ కన్య అక్కడికక్కడే మరణించింది. వీరిని ఢీకొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి టేకులపల్లి బ్రిడ్జి దగ్గర ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాణిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీ కన్యది మరిపెడ బంగ్లా కాగా తీవ్ర గాయాలైన రాణిది గుర్రాలపాడు తండా. శ్రీ కన్య మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు బృందం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయిన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.