నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఎస్ఐ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. వారం రోజుల నుండి యువతి అన్నయ్య సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. బాధితుడికి ఇటీవల నొప్పి ఎక్కువకావడంతో.. ఈ నెల 6న సోదస్పరుడిని తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. రాత్రి సోదరుడికి ఆహారం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు ఆమెకు అక్కడి క్యాంటీన్లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని సూచించాడు. ఆమె తిరిగి లిఫ్టులో వెళ్తుంటే షాదాబ్ అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. యువతి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆస్పత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు షాదాబ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.