– తెలంగాణ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్..
నవ తెలంగాణ – బంజారా హిల్స్
ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్కు అనుబంధంగా సాగే తెలంగాణ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ సభ్యులు టి.యాదయ్య ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ కమీషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడరు.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎన్నోసార్లు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను రవాణా శాఖ అధికారులు కానీ మంత్రి కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం అన్యాయం అన్నారు.
ప్రధాన డిమాండ్లు..
1) ప్రైవేటు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
2) ఓలా, ఉబర్ బైక్లు ఆటోడ్రైవర్ల ఉపాధికి హాని కలిగిస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
3) ప్రైవేట్ రవాణ కార్మికులకూ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలనీ విజ్ఞప్తి చేశారు.
4) రవాణా వాహన బీమా బీమా ప్రీమియంను 50 శాతానికి తగ్గించామని కోరారు.
5) కనీస ఆటో మీటర్ ఛార్జీని 50 గా నిర్ణయించాలి.
6) రవాణా కార్మికులకు డ్రైవర్ బంధు పథకాన్ని ప్రవేశపెట్టలాని కోరారు.