నవతెలంగాణ-హైదరాబాద్ : భారత వాయుసేనలో అగ్నివీరుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్వాయు పోస్టుల భర్తీకి మే 20 నుంచి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఈ-మెయిల్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా కోడ్లను ఎంటర్చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు. ఫేజ్-1 కింద నిర్వహించిన ఆన్లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక పూర్తి చేయనున్నారు.