నవతెలంగాణ – హైదరాబాద్: మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. వన్డే వరల్డ్ కప్లో భారత్ తొలి మ్యాచ్ సమీపిస్తోన్న కొద్దీ ఆటగాళ్ల విషయంలో ఆందోళన కలుగుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అతడి పరిస్థితి బాగానే ఉందని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో అభిమానలకు ఊరట లభించింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వేలికి గాయమైనట్లు సమాచారం. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడికి ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. కంగారు పడాల్సిన అవసరం లేదని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.