నవతెలంగాణ-ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో ఆలూర్ గంగారెడ్డి కీలక పాత్ర పోషించినారని జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు గోర్తా రాజేందర్ అన్నారు. ఆదివారం ఆలూర్ మండల కేంద్రంలో దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగారెడ్డి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆలూరు గంగారెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.