నవతెలంగాణ-పల్నాడు: బస్సు ప్రయాణికులను కాపాడిన ప్రమాదం.. ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడటం ఏంటి అని ఆశ్చర్యపోకండి అదే నిజం లేదంటే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. వారిని ఓ ట్రాన్స్ పోర్ట్ లారీ కాపాడింది. విషయం ఏంటంటే శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వటంతో నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సుకు ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడ ఆగిపోయి ప్రమాదం నుంచి తప్పుకుంది లేదంటే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే నవతా ట్రాన్స్పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెట్లూరు వారి పాలెం ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది. డ్రైవర్లుకు ఎటువంటి గాయాలు అవలేదు లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతింది.