నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో హెచ్ పి సెంటర్, పికెటిపి సెంటర్ లకు చెందిన బీడీ టేకేదర్లు బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన టేకే దారుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా టేకేదర్ యూనియన్ అధ్యక్షులు వైకుంఠం, చింతకింది దాస్,బిఅర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ తోపాటు తదితరులు మాట్లాడుతూ గత 60ఏళ్ళుగా కేకే దర్లను ఎవ్వరూ పట్టించుకో లేదని, కేంద్ర ప్రభుత్వం సవాలక్ష కారణాలు చేపట్టి నేడు బీడీ పరిశ్రమ మూతపడుతుందని,నేలలో నాల్గు, ఐదు రోజులు మాత్రమే పనులు చేయడంతో కుటుంబం గడవడం కష్టతరమైందని వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టేకేదర్ల కోసం ఆలోచన చేసి పట్టించుకోని 2016 రూపాయల పేన్షన్ అందజేస్తమనడం సంతోష దాయకమన్నారు. రాబోవు రోజుల్లో మేము కేసీఆర్ వెంటే ఉండి కేసీఆర్ ని సీఎంగా, ఎమ్మెల్యే ను బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మేజర్ టీ తో గెలిపించుకుంటామని వారన్నారు.ఈ కార్యక్రమం టేకేదర్లు సామల రాజేష్,సంపత్, శ్రీహరి, సాయన్న,జె సాగర్,గురుపధం, పవన్ కళ్యాణ్, మల్లాపూర్ సాగర్, జాగృతి అధ్యక్షులు గంగాధర్ గౌడ్, రైతు నాయకులు కుంట రామిరెడ్డి, యువ నాయకులు రాకేష్ కుమార్, కుంట లక్ష్మయ్య, పందేన చంద్రయ్య, కటికే రాజు, కండక్టర్ హనుమాన్లు, మహిపాల్ రెడ్డి,నెగెల్లి గంగాధర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు