నవతెవలంగాణ – అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై మరో కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును విచారించడానికి అనుమతి కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ వేయనుందని తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సీఐడీ పోలీసులు 2022లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇది వరకే వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ క్రమంలో తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ మాజీ సీఎంను విచారించేందుకు అనుమతి కోరనున్నారని తెలుస్తోంది.