నవతెలంగాణ-హైదరాబాద్: బీసీ కులవృత్తిదారులకు రాష్ట్రం ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచటం లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు జులై 15న చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని వివరించిన మంత్రి.. రూ.లక్ష ఆర్థిక సాయానికి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామన్నారు. మరో విడత దరఖాస్తులకు మరో గడువు తేదీ ఉంటుందన్నారు.