నవతెలంగాణ – భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల పట్టణంలో వినాయక నిమజ్జనం వేడుకల్లో రాత్రి అపశృతి దొర్లింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.