నవతెలంగాణ- ఛండీగఢ్: డ్రగ్స్ సంబంధిత కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఛండీగఢ్లోని సెక్టార్ 5లో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ అరెస్టును ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాధానికి దిగారు. ఆ కేసును సుప్రిం కోర్టు ఎప్పుడో కొట్టేసిందని చెప్పారు.