నవతెలంగాణ-తిరుపతి: తిరుపతి స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద హుండీ ట్రాలీ నుంచి కింద పడిపోయింది. దీంతో హుండీలో నుంచి కానుకలు కింద పడిపోయాయి. ఆలయం నుంచి రోజువారి హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను కొద్దిసేపు నిలిపివేశారు. కింద పడిపోయిన కానుకలను తిరిగి హుండీలోకి వేశారు. తర్వాత హుండీని ట్రాలీలో నుంచి లారీలోకి ఎక్కించి, అక్కడి నుంచి పరకామణికి తరలించారు.