నవతెలంగాణ – హైదరాబాద్: ఉరి వేసుకుని ఓ ఆర్మీ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర సింగ్ (40) ఎండీ లైన్స్ లో ఉన్న మిలిటరీ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ హోదాలో పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తన క్వాటర్స్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఓ ఆర్మీ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర సింగ్ (40) ఎండీ లైన్స్ లో ఉన్న మిలిటరీ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ హోదాలో పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తన క్వాటర్స్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.