ఆర్య వైశ్య కార్పొరేషన్ తీసుకురాని అసమర్ధుడు ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దనపాల్ సూర్యనారాయణ ఆరోపించారు. నిఖిల్ సాయి హోటల్ లో బుధవారం ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం లో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ హాజరై ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరుల్లో ప్రతి కష్టంలో భాగస్వామ్యం అయినను అని అన్నారు, నగరంలోని అనేక సంఘాలకు నా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు అందించాను అని అన్నారు. కుల సంఘాల్లో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదని అన్నారు, ఎవరో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగానే ఎదుర్కొంటానాని, నేను ఎవరిపైన వ్యక్తిగతంగా దూషించలేను అని, మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే 7 సంవత్సరాలు నుంచి నీ పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలంటే ఇప్పటివరకు స్పందించలేదు అని, అర్బన్ లో వందల కోట్ల అభివృద్ధి అని చెప్పుకునే ఎమ్మెల్యే, తను ఇంటిముందు క్యాంప్ ఆఫీస్లు రోడ్లు వేయగానే నిజాంబాద్ అభివృద్ధి అనుకుంటారా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల దోపిడి నిజాంబాద్ లో, భూ కబ్జాలు అంతులేని అవినీతి బయట పెడతాం, వీళ్ళ దోపిడీ విపరీతంగా పేపర్లలో, రోజుకొక అవినీతిని చూపెట్టిన దాన్ని సక్కపెట్టుకునే ప్రయత్నం చేయలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైశ్యులందరూ 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించ లేదని, ఆర్యవైశ్యులకోరకు ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆర్యవైశ్య కార్పోరేషన్ కోసం ఏమాత్రం సహకరించలేదు అని అన్నారు. ఎమ్మెల్యే కు నేను ఒకటే చెప్తున్నా ‘ఈట్ క జవాబ్ పత్తర్ సే దేహింగే’ నువ్వు నా జోలికొస్తే నీకు రెండింతలు సినిమా చూపిస్తా హెచ్చరించారు. ఇప్పటివరకు మనల్ని ఓట్ల కోసమే వాడుకున్నారు ఆర్యవైశ్య విద్యార్థులకు ఎంతోమందికి విద్య గాని వైద్యం కోసం నా దగ్గరికి వస్తే ఖాళీ చేతులతో పంపలేదు అని సభ ముఖంగా గుర్తు చేశారు. ఆర్యవైశ్యుసోదరులకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో మీరందరూ మద్దతు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓసీ లకు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంతో మేలు చేసిందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర లోన్ ఇప్పుడు నగరంలో మన వైశ్య సోదరులు చాలామంది లబ్ధి పొందారు అని, ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ , కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేశారు అని అన్నారు. అలాగే కరోనా సమయంలో ఇబ్బంది పడ్డ వారికి లోన్ సదుపాయం అందించడం, ఉచిత రేషన్ బియ్యం ఇలా పేదల కోసం అవసరమయ్యే ప్రతి కార్యక్రమాన్ని మోడీ ప్రవేశపెట్టారు అని అన్నారు. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, ప్రజలు మనసులో నుంచి రాజకీయ నాయకుడు పేరు సంపాదించాలని, నేను ప్రజల మధ్యలో సేవకుడిగా మెలుగుతున్నాను అని అన్నారు. భవిష్యత్తు లో ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని, మన ఆర్యవైశ్య సోదరులు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పుర ప్రముఖులు మూడ నాగభూషణం గుప్తా, మాజీ అధ్యక్షులు ఉప్పలంచ భూమలింగం, యువజన సంఘం అధ్యక్షులు ఇల్లెందుల ప్రభాకర్, వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు పెండ్యాల వాసు, పాల్దే లక్ష్మీకాంతం, లాబీ శెట్టి శ్రీనివాస్, జిల్లా మహాసభ అధ్యక్షులు మోటూరి మురళి, డాక్టర్ వెంకటరమణ, చిట్టి మిల్ల హరి ప్రసాద్, అరవపల్లి పురుషోత్తం, నంగులూరి పోచయ్య, బేజుగం అశోక్, కార్పొరేటర్ మమత, దన్ పాల్ శ్రీనివాస్, చందూరు ధర్మేందర్, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, బచ్చు పురుషోత్తం, కొండా సత్య ప్రసాద్, పెద్ది సాయిబాబా, శివ నూరి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.