– కాంగ్రెస్లో చేరింది.. కొంత మంది కార్యకర్తలే..!
– అయినాపూర్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు ఈడిగి రుక్మయ్య గౌడ్
నవతెలంగాణ-దోమ
మండలం నుండి 2 వేల మంది కాంగ్రెస్లో చేరా రనేది అబద్దమని అయినాపూర్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు ఈడిగి రుక్మయ్యగౌడ్ అన్నారు. ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వాళ్లు 150 నుండి 200 మంది మాత్రమే ఉన్నారా లేదు 2000 మంది అంటే నిరూపించాలన్నారు. ఎంపీపీ కూడా వారి అనుచరులతో కొన్ని నెలలుగా బీఆర్ ఎస్కు దూరంగా ఉండి ఆ పార్టీ నిర్వహించిన ఏ కార్యక్ర మానికీ హాజరుకాలేని వారే రుక్మయ్య తెలిపారు. అదేకా కుండా వివిధ మండలాలు గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులను పిలిపించి అందరికీ కాంగ్రెస్ కండువాలు వేసి అంతా దోమ మండలకు చెందిన బీఆర్ఎస్ నాయ కులని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని ప్రచారాలూ చేసుకున్న పరిగి గడ్డమీద ఎగిరేది గులాబీ జెండా అని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గార్లపల్లి మల్లేషం, గ్రామ బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.