నవతెలంగాణ- హైదరాబాద్: పొట్టి క్రికెట్లో పసికూన పపువా న్యూ గినియా జట్టు సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయింది. దాంతో, వరల్డ్ కప్ బరిలో నిలిచిన 15వ జట్టు అయింది. తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్ పోటీలో పపువా న్యూ గినియా ఈరోజు ఫిలీప్పీన్స్ జట్టుపై 100 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గినియా టీమ్ 229 రన్స్ కొట్టింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత ఫిలీప్పీన్స్ను 127 పరుగులకే కట్టడి చేసింది. న్యూ గినియా బౌలర్ కబువా మొరియా హ్యాట్రిక్తో సహా 5 వికెట్లతో చెలరేగాడు.