నవతెలంగాణమోపాల్ : ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి రూ 16 కోట్లు మంజూరైన నిధుల నుండి వివిధ మండలాలకు చెందిన కుల సంఘ సభ్యులకు శుక్రవారం రోజున ఎస్ డి ఎఫ్ ప్రోసిడింగ్ పత్రాలను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, అలాగే ఈ నిధులలో భాగంగా, మోపాల్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కొరకు రూ 3 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత. అలాగే భక్త మార్కండేయ పద్మశాలి సంఘం హాల్ కొరకు రూ 3 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాల వారికి ప్రభుత్వ సమన్యాయం చేస్తుంది,సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని అన్నారు.గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మరియు వివిధ కుల సంఘాలకు 16 కోట్లు మంజూరు అయ్యాయని, దీంట్లో భాగంగానే వివిధ మండలాలకు చెందిన కుల సంఘ సభ్యులకు ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోపాల్ సర్పంచ్ క్యాతం రవి, ఎంపీటీసీ ముత్తన్న, టిఆర్ఎస్ నాయకులు కెంపు భూమయ్య, కెంపు సాయిలు, ఎల్లోల్ల రాజాశేఖర్ రెడ్డి ,తదితర కుల సంఘాల పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.