నవతెలంగాణ- తిరుమలగిరి: మూల అశోక్ రెడ్డి నాయకత్వంలో భారీగా చేరికలు తిరుమలగిరి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గతంలో జలాల్పురం, మామిడాల, రాఘవపురం, తిరుమలగిరి మున్సిపల్ తో పాటు పలు ప్రాంతాల నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తిరుమలగిరి మండలంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కాగా తాజాగా గురువారం తిరుమలగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రైతుబంధు మండల కోఆర్డినేటర్ మూల అశోక్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ సభ్యులు బీఆర్ఎస్ తిరుమలగిరి మండల ఉపాధ్యక్షులు కందుకూరు లక్ష్మయ్య ,నాలుగవ వార్డు కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆంగోతు హరిచంద్ర నాయక్, తో పాటు 200 మంది నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తగిన గుణపాఠం తో పాటు స్థానికేతరుడై ఈ ప్రాంత వనరులను దోచుకొని కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్న ఎమ్మెల్యేను ఓటు ద్వారా ఓడించాలని అన్నారు, తాను తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సంవత్సరాలు ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాముల కాగా తనకు కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను ఆదరించి అభ్యర్థిగా నిలబెట్టిందని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. టికెట్ రాగానే అభిమానంతో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏల్సోజు నరేష్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు పేరాల వీరేష్, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎండి ఆఫీజ్, వై. నవీన్, మూల రవీందర్ రెడ్డి, ఎం జితేందర్ , దాచేపల్లి వెంకన్న. మామిడాల సర్పంచ్ బేడుద కరుణాకర్ ,ఎండి కలీం తదితరులు పాల్గొన్నారు.