– పలువురు కార్పొరేటర్ల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏడో కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా.. 9 ఏండ్లలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు వివరించసాగారు. ఈ క్రమంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు వారిని అడ్డు కోవడంతో గందరగోళ పరిస్థితి నెల కొంది. ఎస్ఆర్డీపీ రెండోదశ, మున్సి పల్ కార్మికులను పర్మినెంట్ చేయా లని, జీహెచ్ఎంసీ బకాయిలను వెంట నే చెల్లించాలంటూ కాంగ్రెస్ కార్పొరే టర్లు నిరసన వ్యక్తం చేశారు. శానిటే షన్పై చర్చ జరపాలంటూ పట్టు బట్టారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష కార్పొరేటర్లను మేయర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ప్రత్యేక తీర్మానం చేసి కార్మి కులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇంకా చర్చించాల్సి అంశాలు ఎన్నో ఉన్నా యని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టినా కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఇదిలా వుండగా, కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో తిరిగి బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రర్తలు మేయర్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.