– కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేఅభ్యర్థి డాక్టర్ మురళి నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు: మీరు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటా అని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి దుర్గ భవాని తండా వస్రంతండా రావిరాల మదనతుర్థి గ్రామాలలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ జిల్లా కార్యదర్శి చిన్నలక్ష్మారెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర లతో కలిసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెంటనే అమలు పరుస్తుందని అన్నారు కానీ కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేశాడు. తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో విఫలం చెందాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. తప్ప ఏ ఒక్కరి కూడా న్యాయం చేయలేదని అన్నారు మహబూబాద్ ఎమ్మెల్యే తన స్వార్ధ రాజకీయం చేసుకుంటూ కోట్లాది రూపాయలను దోచుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని అన్నారు గతంలో ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మవద్దని అన్నారు. గమంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండవల కప్పి స్వాగతించారు. బీజేపీ భూత్ అధ్యక్షుడు తాళ్ల అశోక్ ఆ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు కడారి నాగయ్య నాలం రాజు మార్కం మల్లయ్య కడారి వెంకటాద్రి కత్తుల నాగయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు డాక్టర్ మురళి నాయక్ ఆధ్వర్యంలో చీరలు తెలిపారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ కార్యక్రమంలోవైస్ఎంపీపీ జెల్ల వెంకటేష్,జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుఎదల్లయాదవ రెడ్డి, నాయని సత్యపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హేచ్ వేంకటేశ్, సీపీఐ జల్లా నాయకులు అజయ్ సారధి,.మండల నాయకులు ఓరి పెళ్లి వెంకన్న,.గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల మురళి, పేరుమండ్ల మల్లేశం మట్ట యాకుబ్ రెడ్డి, బండపల్లి కృష్ణ కత్తుల వెంకన్న కత్తుల కృష్ణ రేఖ అశోక్ రాస వెంకటరెడ్డి కత్తుల యాకన్న కత్తుల రాము, పట్నం శెట్టి నాగరాజు,.నెలకుర్తి వెంకటరెడ్డి,పొనుగోటి రామారావు, వలబోజు వెంకటేశ్వర్లు కొప్పు శ్రీనివాస్, నేలకుర్తి చెన్న బోయన శ్రీనివాస్ గుగులోతు రమేష్ గుగులోతు రాము తదితరులు పాల్గొన్నారు.
One