![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/06/IMG-20230619-WA0043.jpg)
– ఆగిపోతున్న శ్వాసకి ఊపిరి పోసే నేస్తం నీ రక్తం..
– హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా తలసేమియా బాధిత చిన్నారుల కొరకు టీఎస్ సిపిఎస్ ఈ యు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు ఆధ్వర్యంలో అబిడ్స్ లోని భీమభవన్ లో రక్తదాన శిశిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్ పి ఎస్, సి పి ఎస్ తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి ఖజానా లెక్కల శాఖ సంచాలకులు కె ఎస్ అర్ సీ మూర్తి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్టిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగులు అంటేనే కేవలం హక్కులు కాదు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉంటారని పేర్కొన్నారు.తలసేమియా అనేది ఒక జన్ను సంబంధిత వ్యాధి అని, మనదేశంలో దాదాపు 5కోట్ల మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారుఅని చెప్పారు. వీరికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి జరగవలసిన అవసరం ఉంటుందన్నారు. వేసవికాలంలో రక్తం కొరత చాలా తీవ్రంగా ఉంటుంది అన్నారు.పేద వర్గాలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆర్ధిక కారణాల మూలంగా ఆయుష్షు అర్ధంతరంగా ముగుస్తుంది అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 100 యూనిట్ల రక్తం సేకరించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేటు మెడిసిన్(ఐపిఎం) నారాయణగూడ ల్యాబ్ సహకారం తో వారికి అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జిఎల్ఐ డైరెక్టర్ కే శ్రీనివాస్. రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు ఎం వెంకటేశ్వరరావు. టీఎస్ సీపీఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ. ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్. కోశాధికారి నరేష్ గౌడ్. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు. కార్యదర్శి సత్యనారాయణ. అశోక్ రెడ్డి. శ్యాం కుమార్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.