– కామారెడ్డి జిల్లా కలెక్టర్ వి.జితేష్ పాటీల్..
నవతెలంగాణ – జుక్కల్
అన్ని దానాలలో కన్న రక్త దానం గొప్పదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ వి జితేష్ పాటీల్ అన్నారు. శనివారం నాడు జుక్కల్ మండల కేంద్రంలోని ప్రయివేట్ ఫక్షన్ హలులో రెడ్ క్రాస్ సోసైటి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శభిరం కేంద్రం జిల్లా కలెక్టర్ ప్రారంబించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతు దేశంలో రోజురోజకు ప్రమాదాలతో చోటు చేసుకోవడంతో రక్తం అవసరం ఉంటుందని, రక్తహీనత ఆసుపత్రులలో రోగులకు నిత్యం వేలాదీ లీటర్ల రక్తం అవసరం ఉందని , రక్తదానంలో ఇచ్చే రక్తం ఎందరి ప్రాణాలు కాపాడుకోవచ్చని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, 18ఎండ్లు పూర్తీ అయిన వారు ఓటర్లజాబితాలో నమేాదు చేసుకోవాలని తెలిపారు, రెడ్ క్రాస్ సోసైటి రక్త దాన శిభిరాలు జిల్లాలోని మండలాలో ఏర్పాటు చేయడం జర్గిందని, అందులో జుక్కల్ మండలం ఎప్పుడు రక్తదాన శీభిరాల ఏర్పాటుకు పిలుపు నిచ్చినప్పుడు ముందుకు వచ్చి శిభిరాలలో యువత ముందుకొచ్చి రక్త దాన చేయడం మారుమూల జుక్కల్ ప్రాంత యువతకు మంచి గొప్ప ఆలోచన అని కొనియాడారు. రాబోయే రోజులలో కూడా జిల్లా రెడ్ క్రాస్ సోసైటి ఎటువంటి సమాజిక కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చిన ముందుండి విజయ వంతం చేయాలని యువతకు సూచించారు. యువకులకు ఒక్కరికి కలిసి కలెక్టర్ అభినందించారు. అంతకుముందు జుక్కల్ ప్రాంతం ప్రజల సాంప్రదాయపరంగా గాందీ టోపీ పెట్టి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొంపెలి రాములు, విండోచైర్మేన్ శివానంద్. ఐఆర్ సిఎస్ జిల్లా, మండల శాఖ సబ్యులు, యూత్ సబ్యులు తదితరులు పాల్గోన్నారు.