నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సీతయిపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్దమ్మ గ్రామ దేవతకు గ్రామస్తులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక్కొక్క బోనం చొప్పున అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మండలంలోని నేరల్ గ్రామంలో గ్రామస్తులు ప్రతిసంవత్సరం మాదిరిగానే గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.