నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామపమచాయతి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తగా ఎస్సైగా బాద్యతలు తీసుకున్న సత్యనారాయణను గ్రామస్తులు, నాయకులు జాదవ్ రాజు తదితరులు శాలువాతో సన్మానించారు. ఈ సంధర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతు మండలంలోని ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి శాంతి భద్రతలు కాపాడుతునని పేర్కోన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్షెట్టి గంగాధర్ , ఖండుగొండ తదితరులు పాల్గోన్నారు.