నవతెలంగాణ – హైదారాబాద్: కాంగ్రెస్ గూటికి చేరిన చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు చందానగర్, లింగంపల్లి ముఖ్య నాయకులు దొంతి సత్యనారాయణ గౌడ్,రామచందర్ రెడ్డి, సాయి రెడ్డి, దీపక్ గౌడ్,నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, ఆనంద్ గౌడ్, సతీష్, మహేష్, శ్రీపాల్ గౌడ్, మహిళా నాయకులు సుధారాణి ,రాధ యూత్ సభ్యులు, యువ నాయకులు పార్టీలో చేరారు. వీరికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.