A #BJP leader, identified as #AnujChaudhary, was shot dead outside his residence in UP’s #Moradabad on Thursday night. @dgpup @Uppolice @UPPViralCheck pic.twitter.com/KxAeVTDOB5
— Upendrra Rai (@UpendrraRai) August 11, 2023
నవతెలంగాణ -ఉత్తరప్రదేశ్: సంభాల్ కు చెందిన బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘనటకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనుజ్ చౌదరి గురువారం సాయంత్రం సమయంలో మొరదాబాద్ లోని తన అపార్ట్మెంట్ వద్ద ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు. దీంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగున వెళ్లిపోయాడు. అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతనకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.