నవతెలంగాణ – ఉత్తర్ప్రదేశ్
హెల్మెట్ పెట్టుకోని కారణంగా తనపై చలానా విధించిన పోలీసులకు చుక్కుల చూపించాడో లైన్మన్. కరెంట్ స్తంభం ఎక్కి వైర్లు కత్తిరించి పోలీస్ లైన్స్ మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో, ఎస్పీతో సహా పలువురు పోలీసుల ఇళ్లల్లోని వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది. మీరట్ చెందిన ఖలీద్ విధి నిర్వహణలో భాగంగా హాపూర్కు బైక్పై వచ్చాడు. అయితే, అతడు హెల్మెట్ పెట్టుకోని కారణంగా పోలీసులు చలానా విధించారు. తాను విద్యుత్ ఉద్యోగినని, విధి నిర్వహణపై వచ్చానని అతడు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదట. చట్టం ముందు అందరూ సమానమేనంటూ రూ.1000ల చలానా విధించారట. దీంతో కోపోద్రిక్తుడైన ఖలీద్ స్థానికంగా కరెంటు సరఫరా నిలిపివేయడంలో ఎండలకు తాళలేక జిల్లా ఎస్పీ సహా అనేక మంది పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఖలీద్ కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ ఘటనపై విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ ఇంకా స్పందించలేదు.