![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231026-WA0082-300x225.jpg)
నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండలం,గేమ్యానాయక్ తండా పంచాయతీ లోని గజగరాం తండా లో క్రొత్తగా నిర్మించబోయే సేవాలల్, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి గురువారం బుసిరెడ్డి పౌండషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి యాభై వేల రూపాయలు విరాళం అందజేషారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని ప్రతి దేవాలయానికి ఎంతోకొంత నా వంతు సహాయ సహకారాలు చేస్తా మని అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ కో ఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, యస్.మోతిలాల్, యస్.హర్చన్, యన్. సక్రియా నాయక్, ఆర్.మోతిలాల్, యస్.అశోక్,యస్.మోతిలాల్, యస్.లోకేష్, జె.రమేష్ నాయక్, రమావత్ లక్ష్మణ్ నాయక్, షేక్ ముస్తాఫ, షేక్ రఫీ, ఇస్రం లింగస్వామి, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, పాతనబోయిన కోటయ్య, వెంకటేశ్వర్లు కెవిటి, జగరాం తండా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.