మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో బుధవారం స్వామి వారి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ సుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు. 60 రోజుల్లో స్వామివారికి కానుకగా రూ, 301910 వచ్చినట్లు ఆలయ ఈవో బి ప్రభు తెలిపారు. కార్యక్రమంలో సురేందర్, భాస్కర్ రెడ్డి, ఇస్సాయిపేట బైరయ్య, బాలమల్లు, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.