నవతెలంగాణ-మోపాల్ : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్యాన్సర్ అవేర్నెస్ మాసం సందర్భంగా నిజామాబాదులో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని బోర్గాం పి ప్రభుత్వ పాఠశాల నుండి మూలాంగ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. విశిష్టాధితులుగా డాక్టర్ అజయ్ కుమార్, అభినవ్ సర్దార్ లోహిత్ కుమార్ వారి జిల్లా ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ ప్రతిమ రాజ్ పాల్గొన్నారు. అలాగే ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎం కిరణ్ కుమార్ పచ్చజెండా ఊపిరాలిని ప్రారంభించారు. ఈ ర్యాలీలో హిందూ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి భయంకరమైన వ్యాధిగా క్యాన్సర్ గుర్తింపు పొందిందని క్యాన్సర్ బాధితులకు అందరు చేయూతనివ్వాలని అలాగే ఇది మొదటి రెండవ స్టేజిలో నయం చేసే వ్యాధి అని ప్రజలందరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు. అలాగే ర్యాలీలో క్యాన్సర్ సంబంధించిన నినాదాలను ఇచ్చారు ఊరేగింపు చివరగా పులంగ్ చౌరస్తాలో జాతీయ గీతం ఆలపించి ర్యాలీని ముగించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్, యు.వి ఫౌండేషన్, మేఘన డెంటల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, బీసీ ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు