నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు జరిగాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.