ప్రముఖ తెలుగు
సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నాటి
చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా వారి ప్రాధాన్యత
ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు
సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/UrH5WGIE7L—
M Venkaiah Naidu (@MVenkaiahNaidu) November
11, 2023
నవతెలంగాణ -హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్లోని అపోలో దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలియాజేశారు.. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా ఆయన ప్రాధాన్యత ఎనలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. అయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు.