నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం:స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి.. యాచారం మండలం చింతుల్ల గ్రామంలో విషాదం, ఇబ్రహీంపట్నం చెందిన టిఆర్ఆర్ స్కూల్ బస్సు చిన్నతుండ్లలో భీభత్సం సృష్టించింది. మేకల శివనందు, జ్యోతిల చిన్న కుమార్తెను బస్సు బలితీసుకుంది. చిన్నారి ఆడుకుంటుండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో చిన్నారిని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. చింతుల్ల గ్రామానికి చేరుకున్న స్థానికులు పెద్దఎత్తున రోడ్డు పై బైఠాయించి స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.