నవ తెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్(బి) తాండాలో శుక్రవారం అర్ధరాత్రి బాల్య వివాహం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామానికి చెందిన సుమారు 13 సంవత్సరాల మైనర్ బాలికకు మండలంలోని ఫకీరాబాద్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ మేరకు గ్రామంలోని యువకులు, కొందరు వ్యక్తులు పెండ్లి సమాచారాన్ని అధికారులకు తెలిపేందుకు అర్ధరాత్రి ప్రయత్నించిన స్పందించలేదని, పెండ్లి చేసిన పంతులుకు మైనర్ బాలికకు ఎలా పెండ్లి చేస్తావని ప్రశ్నించారు. గ్రామ పెద్దమనిషి ఎంపీటీసీ భర్తనే చేయాలని చెప్పడంతో పెండ్లి చేశానని పంతులు తెలిపారు. బాలికకు తల్లి లేకపోవడం తండ్రి పేదవాడు కావడంతో ఇద్దరు పిల్లలుండి మూడింతలు వయసున్న పెండ్లికొడుకు ఎదురు కట్నం కింద 60 వేల రూపాయలు ఇచ్చి పెండ్లి చేసుకున్నట్లు తండవాసులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండ్లి ఫోటోలు తీసిన సమాచారం మేరకు ఎంపీటీసీ భర్త శంకర్ నాయక్ ఫోటోలు ఎందుకు తీసారని శనివారం ఉదయం బెదిరింపు చర్యలకు పాల్పడడం గమనర్హం.