నవతెలంగాణ కంఠేశ్వర్:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ఆశ వర్కర్ల సమ్మెను సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18000/-, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాo అవార్డ్స్ పొందారు. కనీస వేతనం నిర్ణయం చేయాలని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరిని రోడ్ల మీద పడి వేశారు. కనీస వేతనం రూ.18000 వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని తెలియచేశారు. ప్రభుత్వము వెంటనే చర్చించి నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలలు దేవతలు అని పొగిడిన పాలకులు కనీస వేతనం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే కనీస స్పందన రాకపోవడంతో సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలు. కంటి వెలుగు, లెప్రసీ, మలేరియా, టిబి గుర్తింపు కార్యక్రమంలో అత్యున్నత పాత్ర వహించారు. కానీ వారికి బిల్లులు మంజూరు చెయ్యలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మనసున మహారాజుకి చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా కడుపులు ఎండబెట్టడం ఎలాంటి మనస్సూ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, లలిత, శోభ, రేవతి రేణుక భారతి సాహేరా తదితరులు పాల్గొన్నారు.