– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ .నాగయ్య
– మండల కేంద్రంలో ఇంటింటికీ ప్రచారం
నవతెలంగాణ-మంచాల
ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు లను అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య ఇబ్రహీంపట్నం నియోజక ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళ వారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణంలో పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా గతంలో ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) అభ్యర్థులు ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి ఈ ప్రాంతంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేశారని గుర్తుచేశారు. అంతేకాకుండా భూమిలేని నిరుపేదలకు వేల ఎకరాల భూమిని పంచారని తెలిపారు.నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కారానికి ఎజెండాగా పని చేశారనీ వివరించారు. అసెంబ్లినీ వేదికగా చేసుకుని పేద ప్రజలకు రావాల్సిన పథకాలు వారికి చేరవేయడంలో ఎనలేని కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను విభజన చేస్తూ, రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర ధరలు రోజురోజుకూ పెంచుతు ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభి స్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి సుత్తి కొడవలి సుక్క గుర్తుకు ఓటు వేసి పగడాల యాదయ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సిలివేరు రాజు, గ్రామ కార్యదర్శి గడ్డం యాదగిరి, నాయకులు జంగయ్య, యాదయ్య, యాదగిరి, నాయకులు జంగ య్య, భాస్కర్, బాల్రాజ్, వెంకన్న పాల్గొన్నారు.