– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం
నవతెలంగాణ-గంగాధర : ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ దేనని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి, కాచిరెడ్డిపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో సత్యం మాట్లాడారు. 2004 ఆనాటి కాంగ్రెస్ పార్టీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్, రుణమాఫీ, వంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ దేనని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పథకాలనే కాపీ కొట్టి తనవిగా ప్రచారం చేసుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇండ్ల స్థలాలు, ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని అన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ నిలిచాడని ఆరోపించారు. గెలిచిన నాలుగేళ్లలోనే వందల కోట్లు అక్రమంగా సంపాదించి తెలంగాణలోనే నెంబర్ వన్ అవినీతి ఎమ్మెల్యేగా రవిశంకర్ పేరు పొందాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, పుల్కం నర్సయ్య, కర్ర విద్యాసాగర్ రెడ్డి, వీర్ల నర్సింగరావు, బండపల్లి యాదగిరి, బుర్గు గంగన్న, పుల్కం గంగన్న, శంకర్, యగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.