నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు సాయంత్రం ఢిల్లికి వెళ్లనున్నారు. ఢిల్లీ ఆదిష్టానం నుంచి కీలక నేతలకు పిలుపు వచ్చింది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా ముఖ్యనేతలకు ఆహ్వానించారు. సోమవారం రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. ఈ నెలాఖరున పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరబోతున్నారు. అయితే.. ఢిల్లీలో కాకుండా ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి పొంగులేటి చేరబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ వేదికగా జరిగే సభలో జూపల్లి, కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు.