– డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
నవతెలంగాణ – మరిపెడ
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంటు వద్దంటున్నారని ఙఆర్ఎస్ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ ఇది అవస్థ మని నిజానికి ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మండలంలోని ఎల్లంపేట, మంచ్య తండ, బోట్యా తండా, జమ్మికుంట తండా, సోమ్లతండా, వీరారం ఉమ్మడి గ్రామపంచాయతీ తండాలలో తదితర తండాలలో విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద నాగారం, కుమ్మరి కుంట్ల గ్రామాల నుండి పలువురు బి.ఆర్.ఎస్ వార్డు మెంబర్లు, కార్యకర్తలు ఎల్లంపేటకు వచ్చి రామచంద్రనాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై ఘాటైన విమర్శలు చేశారు.పెద్దలు రామాసహాయం సురేందర్ రెడ్డి పెట్టిన బిక్షతో ఆయన ప్రజాప్రతినిధిగా అయ్యారని ప్రజలకు గుర్తు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని. త్వరలో మీ అక్రమాల చిట్టూ బయటపెడతానాని ఎల్లంపేట వాసులకు మీరుధైర్యంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గెరంటి పథకాలను ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రచారం చేయాలని చేతి గుర్తుపై ఓటు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటికోమ్ము యుగంధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీపీ గండి బాబు, సీనియర్ నాయకులు కొండం దశరథ, కొండం వెంకన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, జిల్లా నాయకులు అజ్మీర శ్రీనివాస్ నాయక్, సోమల తండా సర్పంచ్ భూక్య కష్ణ నాయక్, ఎల్లంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండి వీరభద్రం, వివిధ తండాల నాయకులు తదితరులు ఉన్నారు.