నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూరులో కంటైనర్ బీభత్సం సృష్టించింది. 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా బూత్ లను కంటైనర్ ఢీకొట్టింది. దీంతో బూత్ లో ఉన్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ అతివేగంగా వచ్చి టోల్గేట్ వద్ద ఉన్న డివైడర్ని ఢీ కొట్టింది. దీంతో కంటైనర్ బోల్తా పడింది. కంటైనర్ వాహనం టోల్ బూత్ని ఢీకొట్టడంతో ఒక టోల్బూత్ పూర్తిగా ధ్వంసం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకవైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. టోల్గేట్ వద్దకు జేసీబీ తెప్పించి బొల్తాపడిన వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.