![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/nvb.jpg)
నవతెలంగాణ -తొర్రూర్ రూరల్
తడి పొడి విధానంతో కాలుష్యాన్ని నివారించవచ్చని కో కార్బన్ ఎక్స్ సొసైటీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ వైస్ చైర్మన్ కార్తిక్ రావు అన్నారు. బుధవారం మండలంలోని హరిపిరాల గ్రామంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ , కార్బన్ ఎక్స్ సొసైటీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో చేయూత స్వచ్చంద సేవా సంస్థ ఎండి రమేష్ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్ కార్బన్ ఎక్స్ సొసైటీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ వైస్ చైర్మన్ కార్తీక్ రావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో రోజు రోజుకు పర్యావరణం పెరుగుతున్న దిశలో వాతావరణ కాలుష్యం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే రైతాంగం పండించే పంటలలో భాగంగా లో భాగంగా వరి క్షేత్రస్థాయిలో దేశంలో ఎక్కువ రైతులు పనిచేస్తున్నారని, అందులో భాగంగా వరి నాటు వేసిన క్రమంలో 15 రోజులు తర్వాత నీటిని ఆరుతూ పారుతూ n తడి పొడి విధానంలో చేయాలని సూచించారు. దీనివల్ల మిథైన్ వాయువులు తగ్గించడంతో వై పిలుకముక్కకు గట్టిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కుమార్, హరిపిరాల, చీకటయపాలెం సర్పంచ్లు రావుల మమత -జగదీశ్వర్ రెడ్డి, బూర్గుల సరోజన _వెంకన్న, ఎంపిటిసి వల్లపు గోపమ్మ మల్లయ్య, చేయూత సంస్థ ప్రతినిధులు శ్రీదేవి, భాస్కర్ చారి, మహేష్ ,నాగరాజు, మురళి, కార్తీక్,రైతులు తదితరులు పాల్గొన్నారు.